– అష్టాదశ శక్తిపీఠ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం
– ఆనంద నిలయం ఆవరణలో ప్రతిష్ట మహౌత్సవాలు
– ప్రభుత్వ సలహాదారు రమణాచారి
నవతెలంగాణ-కొండపాక
ప్రపంచ ప్రసిద్ధి చెందేలా అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం చేపడుతున్నామని ఆనంద నిలయం ట్రస్ట్ సలహాదారు ప్రభుత్వ సలహాదారు రిటైర్డ్ ఐఏఎస్ కె వి రమణ చారి తెలిపారు. కొండపాకలోని అష్టాదశ శక్తిపీఠ దేవాలయం ఆవరణలో ట్రస్టు సభ్యులతో కలిసి బుధవారం ప్రతిష్ట మహౌత్సవ శుభ పత్రికను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కొం డపాక ఆనంద నిలయంలో వద్ధాశ్రమం, అనాధ పిల్లల బాలసదనం, సత్య సాయి బాలికల విద్యాలయం, సత్యసాయి వైద్యాలయం నిర్వహిస్తున్నామన్నారు. అందులో ఇలాంటి శక్తిమయమైన మరో దేవాలయాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజల అదష్టమ న్నారు. సిద్దిపేటకు చెందిన గట్టు రాం రాజేశం గుప్తా సత్ సంకల్పంతో ఆయన అందించిన కోటిన్నర రూపాయల సహాయంతో దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు అయిత నాగరాజు, మహంకాళి రాజేశ్వర రావు,పెద్ది వైకుంఠం, గట్టు అమర్నాథ్, గట్టు రవి, గట్టు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. రిటైర్డ్ ఇంజనీర్ కొండలరావు ఉన్నారు.