వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కె హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందనున్న యూనిక్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ ‘కూర్మ నాయకి’. రోహన్ ప్రొడక్షన్స్, ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్ బ్యానర్స్ పై కె విజిత రావు నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి వి వి దానయ్య క్లాప్ ఇచ్చారు. లౌక్య సాయి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బెక్కం వేణుగోపాల్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో తిరువీర్, శ్రీను గవి రెడ్డి మేకర్స్కు స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు కె హర్షవర్ధన్ మాట్లాడుతూ,’చాలా కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఒక దొంగ, దేవుడు, దెయ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు. మణికాంత్ మాట్లాడుతూ,’ఇది మా మొదటి ప్రొడక్షన్. హర్ష వర్ధన్ కథ చెప్పగానే చాలా నచ్చింది. అవుట్ పుట్ ఒక భారీ బడ్జెట్ సినిమాలానే ఉంటుంది’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ,’మంచి టెక్నికల్ టీంతో సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.