రైలు కార్యకలాపాల భద్రతపై రాజీ లేదు

– భద్రతా సదస్సుల్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భద్రతకు ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, రైళ్లను సురక్షితంగా నడిపే విషయంలో రాజీపడకూడదని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు. విజయవాడ డివిజన్‌లోని ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఈటీటీసీ)లో గురువారం నిర్వహించిన భద్రతా సదస్సులో ఆయన మాట్లాడారు. రైలు కార్యకలాపాల భద్రతకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలు, నిబంధనలను తప్పకుండా పాటించాలని అన్నారు. సిబ్బంది సానుకూల దక్పథంతో ఉండాలని, భద్రతతో కూడిన రవాణానే రైల్వే ప్రధాన లక్ష్యంగా ఎల్లప్పుడూ దష్టి సారించాలని ఆయన చెప్పారు. ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది రైల్వేకు కళ్ళు, చెవుల లాంటివారని, వారి మధ్య సరైన సమన్వయం అవసరమని అన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందికి విధినిర్వహణలో లోతైన, క్షుణ్ణమైన జ్ఞానాన్ని అందించే ప్రక్రియలో భాగంగా ఆచరణాత్మక, ఉద్యోగ శిక్షణపై కూడా ఆయన ప్రసంగించారు. ఈ సదస్సులో విజయవాడ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ శివేంద్ర మోహన్‌, సీనియర్‌ రైల్వే అధికారులు, శాఖాధికారులు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయవాడలోని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాణిక్‌ఘర్‌ గూడ్స్‌ షెడ్‌ వద్ద కొత్తగా నిర్మించిన రైల్వే లైన్‌ నుండి మొదటి ఐరన్‌ ఓర్‌ గూడ్స్‌ రైలును జెండా ఊపి జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌జైన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ బినాగ్య, సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ ఏకే గుప్తా, ఇతర అధికారులు కూడా రైల్‌ నిలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుంటూరు సదస్సులో అనంతరం గుంటూరు రైలుమహల్‌లో జరిగిన భద్రతా సదస్సులో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ భద్రతా సదస్సు సందర్భంగా రైలు కార్యకలాపాల భద్రతను పెంపొందించడం కోసం దష్టి సారించే వివిధ రంగాలపై వివరణాత్మకంగా దశ్యామాద్యమం ద్వారా జీఎం అరుణ్‌కుమార్‌ వివరించారు. ఆపరేటింగ్‌, ఎలక్ట్రికల్‌, ఇంజినీరింగ్‌, మెకానికల్‌ వంటి వివిధ విభాగాల భద్రతా అంశాలపై కూడా ఈ విభాగం ఉద్ఘాటించారు. దీంతోపాటు రాబోయే వర్షాకాలంలో చేపడుతున్న ముందస్తు జాగ్రత్త చర్యల గురించి కూడా వివరించారు. తరువాత ఇంటరాక్టివ్‌ సెషన్‌లో ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది ఆలోచనలు, ప్రశ్నలు, సందేహాలను పరిష్కరించారు. డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయంలో సెక్షన్‌ కంట్రోలర్లు, బ్రాంచ్‌ అధికారులతో విడివిడిగా సమావేశాలను నిర్వహించి ఏలాంటి సత్వరమార్గ పద్ధతులను అవలంబించొద్ద్దని, అన్ని భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. గుంటూరు డివిజన్‌ రైల్వే మేనేజర్‌ ఎం.రామకష్ణన్‌, శాఖాధికారులు, సీనియర్‌ సూపర్‌వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.