నవ తెలంగాణ-ఆర్మూర్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పాటశాల, కళాశాల యందు తెలంగాణ విద్యా దినోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్ధినులతో ర్యాలీ జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం, విద్యార్ధినుల చే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పండిట్ పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, స్థానిక కౌన్సిలర్ ఇట్టెడి నర్సారెడ్డి అతిథులుగా విచ్చేసి, విద్యార్థినులకు నూతన ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని గంగామణ, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.