నవతెలంగాణ హైదరాబాద్: ఆకాశంలో మరోసారి అద్భుతం ఆవిష్కృతం కానుంది. మరోసారి భూమి దగ్గరగా చంద్రుడు రానున్నాడు. దీంతో సూపర్మూన్ ఏర్పడనుంది. సోమవారం ఈ సూపర్మూన్ సాయంత్రం 5 గంటలకు కనువిందు చేసింది. సాధారణంగా రోజూ కనిపించే చంద్రుడి కన్నా 14 శాతం పెద్దదిగా 30శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆకాశంలోని మిగతా నక్షత్రాల కంటే ఈ రోజు చంద్రుడు కొంచెం పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ సంవతర్సంలో ఇదే మొదటిసారి. ఏడాదిలో 12 సార్లు సూపర్మూన్లు ఉంటాయి. కానీ 2023లో 13 సూపర్మూన్లు ఉంటాయి. ఆగస్టులో రెండు సార్లు పూర్ణచంద్రు కనిపించనున్నాడు.