నవతెలంగాణ -ఆర్మూర్
పట్టణ టిఎస్ఆర్ టిసి బస్టాండ్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వృద్ధ మహిళ కాలు నజ్జు నజ్జు అయింది. నిజామాబాద్ నుండి ఆర్మూర్ వైపు వస్తున్న ఐచర్ వాహనం ఏపీ 15 టి సి 33 74 నంబరు డ్రైవరు వాహన వేగం అదుపు కాలేక ద్విచక్ర వాహన దారునికి ఢీకొనగా వెనక కూర్చున్న వృద్ధ మహిళ కాలు విరిగింది. అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తరలించగా, ఐచర్ వాహన డ్రైవర్ స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిన సంఘటన వివరాలు సమాచారం అందించారు. రోడ్డుపై తీవ్ర రక్తస్రావం కాగా వచ్చిపోయే వాహనదారులు తీవ్ర భయాందోళన చెందినారు.