నవతెలంగాణ-మియాపూర్
మియాపూర్ డివిజన్లోని పలు కాలనీ సమ స్యలను పరిష్కరించాలని కృషి చేస్తానని మియా పూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ అన్నారు. డివిజన్ పరి ధిలోని ముజఫర్ హమ్మద్ నగర్ కాలనీ వాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ..ఎంఎనగర్ కాలనీ వాసులు కాలనీలోని పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగు తున్నామన్నారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రయినేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృ ద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందు బాటులోకి తీసుకువచ్చేల కృషి చేస్తామని తెలిపా రు. కార్యక్రమంలో కాలనీ వాసులు కృష్ణ రావు, లసని రాజు, అనిల్, డప్పు రాములు, మధు, వెం కటేష్, ఆంజనేయులు, వీరన్న పటేల్, మల్లేష్, వెల్డిం గ్ రాజు, అనిల్ రెడ్డి, యదయ్యా, శివ ముదిరాజ్, అవినాష్, పాండు, లక్ష్మణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.