– సంయుక్త కిసాన్ మోర్చా
– సెప్టెంబర్ 30న జిల్లా సదస్సు
– చందు నాయక్ ఆది సాయన్న
నవతెలంగాణ – జనగామ
మోడీ ప్రభుత్వం ఢిల్లీలో రైతు ఉద్యమానికి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలపై చేసిన మోసానికి నిరసనగా దేశ వ్యాప్తంగా రెండో దశ రైతాంగ ఉద్యమానికి సన్నద్ధం కావాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆది సాయన్నలు
పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో గురువారం సంయుక్త కిసాన్ మోర్చా జనగామ జిల్లా సన్నాహక సమావేశం తెలంగాణ వ్యవసాయ రాష్ట్ర కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళంపల్లి జనార్ధన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోతుకనూరి ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా
చందు నాయక్ ఆది సాయన్నలు పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 9, 2021 న ప్రధాన మంత్రి మోడీ లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీల ఆధారంగా ఢిల్లీని ఘెరావ్ చేసిన రైతు ఉద్యమం తాత్కాలికంగా విరమించుకుంది అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలైన కనీస మద్దతు ధరల చట్టం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరణ, దేశంలో రైతులందరికీ రుణాల ఏకకాలంలో మాఫీ, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకును కఠినంగా శిక్షించాలని, రైతు ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత వంటి హామీల అమలు చేయలేదన్నారు. రైతులను మోడీ ప్రభుత్వం చేసిన మోసాన్ని మళ్ళీ ప్రజలలోకి తీసుకు వెళుతూ దేశ వ్యాప్తంగా రెండో దశ రైతు ఉద్యమం ప్రారంభించాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది అన్నారు. అందులో భాగంగానే సంయుక్త కిసాన్ మోర్చా జనగామ జిల్లా సదస్సు సెప్టెంబర్ 30వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్ణయించామని తెలిపారు. ఈ సదస్సులో రైతు సమస్యలను చర్చించి పలు నిర్ణయాలు తీసుకొని నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు వివిధ సంఘాల నాయకులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మండల గట్టుమల్లు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ బిరయ్య, రామావత్ మీ ట్యా నాయక్, రైతు సంఘాల నాయకులు చొప్పరి సోమయ్య, వెంకటయ్య, వెంకటరెడ్డి, జోగు పరశురాములు, కోయల్ కార్ సాయి, ప్రకాష్, రాములు, పద్మ, వజ్రమ్మ, విజయ కుమార్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.