నవతెలంగాణ – భీంగల్
భీంగల్… మండలంలోని పిప్రి గ్రామంలో భరత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ సెక్రెటరీ విభాగానికి చెందిన ఐదుగురు అసిస్టెంట్ సెక్షన్ ట్రేయిని అధికారులు మహిళా సంఘాల పనితీరును చేపట్టే ఆదాయాభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామ సంఘాల ద్వారా బ్యాంకు లోన్ ద్వారా అప్పులు తీసుకొని నడుపుతున్న బట్టల షాపులు మరియు కిరణం షాపులకు ప్రత్యక్షంగా వెళ్లి సందర్శించారు. ఐకెపి చేపడుతున్న ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైన్ అధికారులు వైశాలి షేకవత్, అవంతిక, ప్రతీక చాహర్, శివం కుమార్, కూనత్ మరియు ఎపియం కుంట శ్రీనివాస్, ఏపీవో నర్సయ్య, ఐకేపీ సీసీ రఘుపతి, సర్పంచ్ ప్రవీణ్, ఎంపీటీసీ అరిగెల స్వామీ సరితా, ఉప సర్పంచ్ రవీందర్, కార్యదర్శులు శేఖర్, హేమ, కరోబార్ ముత్తన్న పాల్గొన్నారు.