నవతెలంగాణ – ఢిల్లీ: నేపాల్లో సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా ఎత్తయిన ఉమ్లింగ్ లా పాస్కు వెళ్లివచ్చిన అతిపిన్న వయస్కుడిగా.. కర్ణాటకకు చెందిన మూడున్నరేళ్ల బాలుడు ఘనత సాధించాడు. దక్షిణ కన్నడ జిల్లా సూలియాకు చెందిన జజీల్ రెహ్మాన్ అనే చిన్నారి.. తన తల్లిదండ్రులు తౌహీద్ రెహ్మాన్, జష్మియాలతో కలసి ఈ సాహసం చేశాడు. ఈ ముగ్గురూ ఆగస్టు 15న బైక్పై సూలియాలో బయలుదేరారు. 19 రోజుల్లో దాదాపు 5వేల కిలోమీటర్లు ప్రయాణించి.. గత శనివారం లద్దాఖ్లోని ఉమ్లింగ్ లాకు వెళ్లారు. అక్కడ జాతీయ జెండా, కర్ణాటక జెండా, తులునాడు పతాకాలను ఆవిష్కరించారు.