– జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి.
– బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ మేడిగడ్డ, శంకర్ కొండ వాసుల నిరాహార దీక్ష.
నవతెలంగాణ-ఆమనగల్
మండలంలోని మేడిగడ్డ శంకర్ కొండ గ్రామాల మధ్య రోడ్డులో ఉన్న కత్వ వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నా రు. కత్వ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చే స్తూ మేడిగడ్డ గెట్ వద్ద ఆదివారం శ్రీశైలం హైద రాబాద్ జాతీయ రహదారి పక్కన మేడిగడ్డ, శంకర్ కొండ గ్రామాలతో పాటు వాటి పరిధిలో ఉన్న చప్ట తాండ, దయ్యాల బోడు, సామాయిపల్లి, కేశ్యాతాం డాలకు చెందిన యువతీ యువకులు పెద్ద సంఖ్య లో నిరసన నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచా రి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు రాజు నాయక్ తదితరులు సందర్శించి వారికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. సంబందిత అధికారు లు వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ఈప్రాంత ప్రజల ఇబ్బందులను తొలగించాలని వారు సూచించారు. కార్యక్రమంలో మేడిగడ్డ శంకర్ కొండ గ్రామాల ఉపసర్పంచ్లు మల్లేష్ నాయక్, ప్రశాంత్, నాయకులు కష్ణ నాయక్, నరేష్ నాయక్, మహిపాల్, రాజు నాయక్, నవీన్ నాయక్, అంజ య్య నాయక్, భాస్కర్, నందు తదితరులున్నారు.