నవతెలంగాణ హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టు రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలుకొట్టింది. అయితే సమయానికి ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారులో నుంచి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉన్నారని, వారిలో ఒకరు బెంగళూరు వెళ్తున్నట్టు తెలిపారు. ప్రధమ చికిత్స అనంతరం అతడిని మరో కారులో విమానాశ్రయానికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.