నవ తెలంగాణ – సిద్దిపేట
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు లండన్ లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దశాబ్ధి దగ సమాలోచన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ తెలిపారు. లండన్ నుండి ఆయన మాట్లాడుతూ కో-కన్వీనర్ రంగుల సుధాకర్, కార్యదర్శి నీలా శ్రీధర్, మహిళా విభాగం కో-ఆర్డినేటర్ మేరీ ఎగ, సయ్యద్ అక్బర్ హుస్సేన్, శీలం శ్రీనివాస్ రెడ్డి, అవినాష్ గౌడ్ మరుపల్లి, గంగం మధుకర్ రెడ్డి, జవ్వద్ అయాన్, నరేష్ కుమార్, ఆదర్శ రెడ్డి, జవహర్ రెడ్డి, మధుకర్ అలవల, రోహిత్ రెడ్డి చందుపట్ల, సాయినాథ్ 22 మంది ఎగ్జిక్యూటివ్ మెంబెర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని చర్చించినట్లు తెలిపారు. చర్చా వేదికలో 9 ఏండ్ల పాలనలో వివిధ రంగాల్లో కేటాయించిన నిధులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాని డిమాండ్ చేశామన్నారు. 9 ఏండ్లకు దశాబ్ది ఉత్సవాల పేరిట, ప్రజాధనంతో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేసుకోవడం శోచనీయం అని, గత 9 ఏండ్లలో విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ కల్పన.. ఇలా అన్ని రంగాల్లో కెసిఆర్ చేసింది ఏమి లేదన్నారు. కాంగ్రెస్ నాటిన విత్తనాల ఫలితాలే కాల క్రమేణా పెరిగిన అభివృద్ధి పై కెసిఆర్ తన పేరు చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎన్నారై సెల్ ఏర్పాటు చేసి, 500 కోట్ల నిధులతో గల్ఫ్ బాధితులకు బాసటగా ఉంటామని నమ్మబలికి, నేడు 9 ఏండ్లకు కూడా ఎలాంటి చర్యలకు ఉపాక్రమించలేదని, ఇదే కెసిఆర్ దశాబ్ది దగ కు చక్కని ఉదాహరణ గ పేర్కొన్నారు. 2014 లో అధికారం లోకి వచ్చిన 3 నెలల్లోనే ముస్లిం మైనారిటీ వర్గాలకు 4 శాతం ఉన్న రిజర్వేషన్స్ ని 12 శాతం చేస్తామని చెప్పి 9 ఏండ్లుగా నీరు గార్చి దగా చేసినారని పేర్కొన్నారు. కేజీ టు పీజీ పేరు అంటూ అధికారం లోకి వచ్చి ఈ 9 ఏండ్ల లో కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థ ని ధ్వంసం చేశారని అన్నారు. ప్రభుత్వ బడుల్లో నియామకాలు లేవు, ఖాళీలు భర్తీ లు లేవు, ప్రాధమిక విద్య దాదాపు పూర్తిగా ప్రయివేటు పరం చేశారు, ఇంటర్ మార్కుల్లో గోల్మాల్, వివిధ ఎంట్రెన్స్ లలో ప్రశ్న పత్రాల లీకేజ్, యూనివర్సిటీ లలో ఖాళీల భర్తీ చేయకపోవడం, ప్రయివేటు యూనివర్సిటీ లు ఏర్పాటు చేయడం, ఐఐఐటి లో కూడా విద్యార్థుల ఆత్మ హత్యలు.. ఇలా పూర్తి విద్యా వ్యవస్థ ని ధ్వంసం చేశారని అన్నారు. ధర్నా చౌక్ ఎత్తి వేత, ఉద్యోగ నేతల అరెస్ట్, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత పై నిరసన కార్యక్రమాల పై ఉక్కు పాదం తో అణిచివేత, రైతులకు బేడీలు, తమ ప్రజా విధానాలని ఎత్తి చూపుతున్న జర్నలిస్ట్ లపై దౌర్జన్యం, వేధింపులు, అణిచివేత చేస్తున్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా, వివిధ పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా, కల్తీ విత్తనాలు అరికట్టడం లో విఫలం ఐ, ఎరువులు, ఫెస్టిసైడ్ ధరలు నియంత్రణ చేయకుండా, రైతు బంధు పేరుతో దగా చేస్తూ, రైతులకు వ్యవసాయం ద్వారా రాబడి, లాభాల్లో వాటా తగ్గే విధంగా కెసిఆర్ ప్రభుత్వం విధానాలు ఉన్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ పాలన కి ముగింపు పలికి , రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో సామాజిక న్యాయాన్ని పొంది, సమూలాభివృద్ధి పొందుతామనే ఆశాభావం వ్యక్త పరిచారు.