![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230805-WA01282.jpg)
గత రెండేళ్లుగా డిచ్ పల్లి తహసిల్దార్ శ్రీనివాస్ రావు డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామానికి అన్ని రకాల సేవలను అందజేశారని బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి సతిష్ రెడ్డి అన్నారు. గ్రామానికి అనేక సేవలందించిన తహసిల్దార్ శ్రీనివాస్ రావు ను గ్రామ ప్రజల తరఫున మా గ్రామానికి చేసిన సేవలు ధరణి వలన అనేక ఇబ్బందులను తొలగించడంలో పూర్తిగా సహకరించినందుకు గాను, తహసిల్దార్ ల బదిలీల్లో బాగంగా వేళ్తుండటంతో గ్రామస్తుల తరఫున మర్యాదపూర్వకంగా సన్మానం చేసినట్లు అయన తెలిపారు.ఈ కార్యక్రమం లో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నరహరి, క్రాంతి కుమార్, ప్రవీణ్, నరేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.