నవతెలంగాణ కంఠేశ్వర్
నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ బుధవారం తెలిపారు. ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..అంబేడ్కర్ కాలనీ, నిజామాబాద్ కు చెందిన రావుల మహేందర్(37) సెల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. మహేందర్ మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది, సోమవారం అర్థరాత్రి సమయంలో తన ఇంటిలో చున్ని తో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యులు మూడవ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. తన భార్య సునీత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.