నవతెలంగాణ-శంకర్పల్లి
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు.ఈ ఘటన మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ అశోక బిల్డర్ సమీపంలో గురువారం జరిగింది. శంకర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామానికి చెందిన కుమార్ (40) తన బైకుపై శంకర్పల్లి మండలంలోని మోకిలాకు పనుల నిమిత్తం వెళ్లి, తిరిగి సొంతుర్కు వెళ్లుతుండగా రోడ్డుపై బొక్క బోర్ల పడటంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెంది ఉన్నాడు. అయితే మృతుడు అత్తగారి ఊరైన మోకిలా గ్రామానికి వెళ్లలేదు. ఈ ఘటన యాక్సిడెంటా లేదా, ప్రమాదవశాత్తు బైకు స్క్రిడై పడిపోయాడా అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్యా,పిల్లలు ఉన్నారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు శంకర్పల్లి ఎస్ఐ సంతోష్ రెడ్డి తెలిపారు.