నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్లోని ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా.. అంటూ కుటుంబ సభ్యులకు చరవాణిలో సమాచారం అందించి ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటు చేసుకుంది. ఆదివారం ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర షోలాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సౌందర్య (33)కు.. అదే ప్రాంతానికి చెందిన ఆర్కిటెక్చర్ ఇంజినీర్ అభినవ్తో 6 నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహమైంది. ఇటీవల హైదరాబాద్కు మకాం మార్చిన అభినవ్ దంపతులు.. కొండాపూర్లో ఉంటున్నారు. ఈనెల 8న ఆమె విధులకు బయలుదేరి.. శంషాబాద్లో ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్ చేసి కుటుంబసభ్యులకు చెప్పింది. అప్రమత్తమైన వారు 100కు డయల్ చేయగా.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి సౌందర్య భవనంపై నుంచి దూకి.. తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సౌందర్య తల్లితండ్రులు 5 ఏళ్ల క్రితమే మృతిచెందారు.