నవతెలంగాణ- ఆర్మూర్
యావత్ ప్రపంచం ఉత్కాంతగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 కీలక ఘట్టం నేడే.. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చెందిన వెంగనవాసు చంద్రయాన్ 3 లాంచింగ్ వీక్షణకు ఎంపికయ్యారు. కాగా బుధవారం బయలుదేరుతున్నట్టు విద్యార్థి తండ్రి వెంగల్ రావు తెలిపారు .బెంగళూరు ఇస్రో కంట్రోల్ సెంటర్ నుండి విద్యార్థికి ఆహ్వానం అందింది. ఈనెల 25న ఇస్రో ఆధ్వర్యంలో చంద్రమండలంలోని కక్షలోకి చంద్రయాన్ మూడును ప్రయోగించనున్నారు .ఈ ప్రయోగాన్ని ప్రధాని మోడీతో పాటు శాస్త్రవేత్తలు వీక్షించనున్నారు.. ఈ వీక్షణకు తెలంగాణ నుండి ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ మోడల్ స్కూల్ నుండి వేంగన వాస్ ఎంపికయ్యారు. ఈ విద్యార్థి గతంలో సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్స్, ఇంటింటి ఇన్నోవేటర్ కార్యక్రమాలలో అత్యంత ప్రతిభ చూపాడు .ఐఐటి హైదరాబాద్ కేఎల్ యు యూనివర్సిటీ ఆగస్టు వారు నిర్వహించిన ఐడియా తాన్ కాంపిటీషన్లో సైన్స్ ప్రాజెక్ట్ లో రెండవ స్థానం పొందినారు.. గత నెలలో సైతం అమెరికాకు చెందిన టాల్ స్కౌట్స్ వారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి సైన్సు ఆన్లైన్ పరీక్ష పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం పొందినాడు. విద్యార్థి యొక్క ప్రతిభను గుర్తించిన ఇస్రో వారు వీక్షణకు ఎంపిక చేసినారు.. తెలంగాణకు చెందిన 30 మంది విద్యార్థులలో అత్యంత ప్రతిభ చూపిన వెంగన్ వాస్ 3 వీక్షణకు ఇస్రో అధికారులు ఎంపిక చేయడం విశేషం. మధ్యతరగతి కుటుంబం నుండి విద్యార్థి అత్యంత ప్రతిభ కనబరచడం హర్షనీయమని విద్యావేత్తలు అన్నారు . తండ్రి వ్యాపారి కాగా, తల్లి గృహిణి.. విద్యార్థి యొక్క ఎంపికపై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయ బృందం ,విద్యార్థులు హర్షం వ్యక్తం చేసినారు.