నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నీట మునిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మండల బిజెపి అధ్యక్షులు రమేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వరద నీరు చేరడం పట్ల అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకు సమీపంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారని, దీంతో వర్షం పడిన సమయంలో ఇండ్లలోకి నీరు వచ్చి చేరుతుందని తెలిపారు. ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చిన చోట ఇండ్ల నిర్మాణం చేపట్టి ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి అధ్యక్షులు నరేందర్ రెడ్డి, పట్టణ బిజెపి అధ్యక్షులు నరసింహులు, నాయకులు ఏక్ నాథ్, జైపాల్ రెడ్డి ,రవీందర్ రెడ్డి, బలరాం, శ్రీనివాస్, బాలరాజ్ ,మైపాల్ రెడ్డి, శ్రీనివాస్ ,రంజిత్ ,రాకేష్, రాజు, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.