నవతెలంగాణ- భిక్కనూర్
ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మరణించిన సంఘటన మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన విలువల ప్రకారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ( 25 ) బట్టలు ఉతడానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మరణించాడు. కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా బట్టలు మాత్రమే కనిపించగా చుట్టుపక్కల ఎంత వెతికినా అనిల్ కనిపించలేదు. మంగళవారం ఉదయం చెరువు వద్దకు వెళ్లి చూడగా అనిల్ శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మరణించిన సంఘటన మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన విలువల ప్రకారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ( 25 ) బట్టలు ఉతడానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మరణించాడు. కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా బట్టలు మాత్రమే కనిపించగా చుట్టుపక్కల ఎంత వెతికినా అనిల్ కనిపించలేదు. మంగళవారం ఉదయం చెరువు వద్దకు వెళ్లి చూడగా అనిల్ శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.