ఆలిండియా టాపర్గా వరుణ్ చక్రవర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్-2023) ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు సత్తాచాటారు. ఆలిండియా టాపర్గా శ్రీచైతన్య విద్యార్థి బోర వరుణ్ చక్రవర్తి 720కి 720 మార్కులను సాధించి ఓపెన్ కేటగిరీలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్ సుష్మ మాట్లాడుతూ ఎస్ వరుణ్ 715 మార్కులతో తొమ్మిదో ర్యాంకును సాధించారన్నారు. శశాంక్ కుమార్ 14వ ర్యాంకును, రఘురామ్ రెడ్డి 15వ ర్యాంకును పొందారని వివరించారు.
ఆలిండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 15లోపు నాలుగు, టాప్ 50లోపు తొమ్మిది, టాప్ 100లోపు 15 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారని చెప్పారు. వివిధ కేటగిరీల్లోనూ టాప్ 10లోపు 11, టాప్ 100లోపు 79 ర్యాంకులు ఒక్క శ్రీచైతన్య విద్యార్థులు ఈ ఘనత పొందారని అన్నారు. 700 మార్కులు ఆపైన 54 మంది విద్యార్థులు పొందారని అన్నారు. ఇది శ్రీ చైతన్య ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. అందువల్లే దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశాల కోసం విద్యార్థులు శ్రీచైతన్యను కోరుకుంటున్నారన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బిఎస్ రావు అభినందించారని వివరించారు.