![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230725-WA0732.jpg)
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని లింగాల బంధాల ఏజెన్సీలో ఆదివాసి రైతులకు ఖరాబైన, నకిలీ విత్తనాలు డీలర్లు అమ్ముతున్నారని వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ పాయం నర్సింగ్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం లింగాల ఏజెన్సీ నుండి నవతెలంగాణ విలేకరితో ఫోన్లో మాట్లాడారు. రైతు సంక్షేమం గురించి ఎన్నో రకాల సౌకర్యాలు కల్పించిన మా లింగాల బంధాల ఏజెన్సీ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన చెందారు. బంధాల గ్రామపంచాయతీ పరిధిలోని నర్సాపూర్(పియల్) గ్రామానికి చెందిన మంకిడి సాంబశివరావు అనే ఆదివాసి రైతు గత పది రోజుల క్రితం పరిసర గ్రామమైన ‘మామిడిగూడెం’ గ్రామానికి చెందిన ఆదివాసి రైతులకు పెట్టుబడి పెట్టే సేట్, డీలర్ జనగాం సురేష్ అనే డీలర్ వద్ద ఒక బస్తా వరి విత్తనాల భస్తాను కొనుగోలు చేసి తీసుకున్నాడని, ఆ బస్తాలోని వరి వంగడాలు మొత్తం ఖరాబై, నాసిరకంగా, మొలకలు వచ్చి ఖరాబై ఉన్నాయని ఆ రైతు రోధిస్తున్నాడని, మంకిడి సాంబశివరావు అనే ఆదివాసి గిరిజన రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ రైతు విత్తనాలు వేయకుండా ఐదు ఎకరాల భూమి విత్తనాలు విత్తకుండానే నష్టపోయాడని ఆవేదన చెందారు. లింగాల బంధాల ప్రాంతంలో ఆదివాసి గిరిజనులను పెట్టుబడి రైతులకు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా అధిక వడ్డీ లు తీసుకొని, ఆదివాసి గిరిజన రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆవేదన చెందారు. లింగాల, బంధాల గ్రామపంచాయతీ లోని పెట్టుబడి పెట్టే బడా సీట్ ల నుండి ఆదివాసి రైతులను విముక్తి కల్పించాలని కోరారు. మంకిడి సాంబశివరావు అనే రైతు ఖరాబైన విత్తనాలతో సమయం దాటిపోయి పొలాన్ని బీడుగా ఉంచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని లక్షల పంట పండే భూమి అలాగే ఉండిపోయిందని ఆదివాసి గిరిజన రైతన్న సాంబశివరావు కు న్యాయం చేయాలని కోరారు.