నవతెలంగాణ – మహబూబాబాద్: ఏసీబీ అధికారుల సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల తనిఖీలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. పంచాయతీ రాజ్శాఖ భవనంలో ఈ రోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.5 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు దొడ్డ లలిత పట్టుబడ్డారు. అనంతరం వరంగల్ ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.