– నివాళులు అర్పించిన
– రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాది జిల్లా కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకులు ఘనంగా జరిగాయి. చాకలి ఐలమ్మ చిత్రపటా నికి అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్తో కలిసి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పూలమాల వేసి నివాళులార్పించారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లా డుతూ..సాయుధ తెలంగాణ పోరాట కాలంలో ఐలమ్మ కన బరిచిన ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికీ గర్వ కారణమని తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితోని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఐలమ్మ పేద వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగంచేసి తన కుటుంబాన్ని కోల్పోయిందని అన్నారు. ఆమె పోరాట పటిమను రాబోయే తరాలకు వివరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫెర్ అధికారి ఊపేందర్, ఎమ్డీపీఓ సత్తయ్య, వివిధ కుల సంఘాల నాయ కులు సి రమేష్, దత్తు, కృష్ణయ్య, రాజలింగం, జగదీశ్వర్, మారుతీ, రాజేందర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.