![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230801-WA0004-300x194.jpg)
మండల్ డే సందర్భంగా ఆగస్టు 7న తిరుపతిలో జరిగే అఖిల భారత జాతీయ ఓబిసి 8వ మహాసభ ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహించునున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను మంగళవారం నిజామాబాద్ జిల్లా బీసీ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ నుండి పెద్ద ఎత్తున బీసీలు మహాసభకు తరలి రావాలని జిల్లా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ విజ్ఞప్తి చేయడం జరిగింది.ఈ మహాసభలో బీసీలకు దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ రంగాలలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల బీసీల స్థితిగతులపైన చర్చించడం జరుగుతుందని, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60% టికెట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. బీసీలందరు రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు.రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 స్థానాలకు గాను ఐదు అసెంబ్లీ స్థానాలను బీసీల కేటాయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు పోల్కం గంగాకిషన్, ధర్శనం దేవేందర్, కరిపే రవిందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, సంజీవ్, బాలన్న, తోట మహేష్, శంకర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.