నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు ఐపీఎల్ కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై మ్యాచ్ తనకు చివరిదని నిర్ధారిస్తూ రాయుడు ట్వీట్ చేశాడు. కాగా అంబటి రాయుడి ఐపీఎల్ కెరియర్ 2010లో ముంబై ఇండియన్స్ తరపున మొదలైంది. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చెన్నై టైటిల్ గెలిచిన రెండు సీజన్లలో జట్టు సభ్యుడిగా కీలక పాత్ర పోషించాడు.
రెండు గొప్ప టీమ్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 204 మ్యాచ్లు. 14 సీజన్లు, 11 ప్లే ఆఫ్స్, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు. ఈ రోజు రాత్రి 6వ టైటిల్ కూడా దక్కుతుందనుకుంటున్నాను. చక్కటి ప్రయాణం. ఈ రోజు రాత్రి జరిగే ఫైనల్ మ్యాచే ఐపీఎల్ కెరియర్లో చివరి మ్యాచ్గా నిర్ణయించుకున్నాను. ఇంత గొప్ప టోర్నమెంట్లో ఆడడం నిజంగా ఆస్వాదించాను. అందరికీ ధన్యవాదాలు. ఈ నిర్ణయంలో యు టర్న్ ఉండదు అని అంబటి రాయుడు తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్లో రాసుకొచ్చాడు. కాగా అంబటి రాయుడు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.