నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలకు ఇచ్చిన హామీలు ఎటూ పోయాయని ఎమ్మెల్యే రఘునందన్ రావ్ నీ దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చింతల జ్యోతి కృష్ణ ప్రశ్నించారు. ఈ మేరకు దుబ్బాక లో వారు మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రి హరీష్ రావు సహకారంతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవతో దుబ్బాక లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్ రావ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. కేంద్రం నుండి దుబ్బాక కు నిధులు తెస్తానని చెప్పి నయ పైసా తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు.దుబ్బాక అభివృద్ధిలో వారు తెచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ హయాంలోనే దుబ్బాక కు నిధులు వచ్చాయని ఈ విషయంలో బహిరంగ సమావేశానికి ఎమ్మెల్యే సిద్దమా అని సవాల్ విసిరారు.