నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సుఖ్వీందర్ సింగ్ (42) అనే వ్యక్తి కారుపై నియంత్రణ కోల్పోవడంతో అది అదుపుతప్పి పక్క లేన్ లోకి దూసుకుపోయింది. ఇండియానాపోలిస్ పట్టణంలో ఈ నెల 13న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయాలతో చికిత్స పొందుతూ ఎస్కెనాజి హాస్పిటల్ లో సింగ్ మరణించాడు. సింగ్ హోండా అకార్డ్ వాహనంలో వెళుతుండగా, అది అదుపుతప్పి పక్క రోడ్డులోకి చొచ్చుకుపోయింది. అటువైపు వస్తున్న వేరొక వాహనంతో ఢీకొట్టింది. అవతలి వాహనం డ్రైవర్, అందులోని మహిళకు సైతం గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు ప్రకటించారు.