నవతెలంగాణ- జమ్మికుంట:
ఈనెల 9న రాత్రి 08.35 గంటలకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ జి తిరుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని పురుషుడు వయస్సు సుమారు 40-45 సంవత్సరాలు బిజి గిరిషరీఫ్-పొత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పొత్కపల్లి గ్రామం ప్రక్కన రైలు పట్టాలపై ఎగువ లైన్ లో వెళ్లే టి ఆర్ నెంబర్.12707 ఏపీ సంపార్కుక్రాంతి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు. శవం ఈడ్చాబడి నందున పూర్తిగా నుజ్జు నుజ్జు అయినది. ముఖం గుర్తు పట్టడానికి వీలులేకుండా ఉన్నది. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. దుస్తులు: నలుపు కలర్ ప్యాంటు కలవు. శవాన్ని గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ లో భద్రపర్చనైనది. ఏమైనా వివరాలు తెలిసినచో ఫోన్ నెంబర్ 9949304574, 8712658604 కి తెలుపాలని తిరుపతి పేర్కొన్నారు.