![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230922-WA0071-300x225.jpg)
మోపాల్ మండలంలోని తాసిల్దార్ ఆఫీస్ ముందు 12 రోజులుగా ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్ష చేపడుతున్న అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్ శుక్రవారం రోజున వినూత్నంగా మోకాళ్లపై నిలబడి తమ నిరసనను కొనసాగించారు, కనీసం ఈ రకంగా చేస్తే అయినా సరే గౌరవ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వ అధికారులకు గాని తమ పైన చలనం పుట్టి తమ ఉద్యోగ భద్రత కల్పిస్తారని అలాగే 10 లక్షల ఇన్సూరెన్స్ కలుగ చేస్తారని దానితో పాటు 26 వేతనం అందజేస్తారని ఉద్యోగ భద్రత కల్పిస్తారని తమ కుటుంబాల్లోనూ తమ జీవితాల్లోనూ వెలుగు నింపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోపాల్ మండలంలోని అంగన్వాడి టీచర్లు రోజుకో రకంగా తమ నిరసనని శాంతియుతంగా ప్రభుత్వానికి నివేదిస్తున్నారు ఒకరోజు వంట వార్పుగా మరొక రోజు గణేశునికి తమ డిమాండ్ల ప్రతిని అందజేసి వేడుకున్నారు, కొందరు అంగన్వాడి టీచర్లు తమ చిన్న నెలలు నిండిన పిల్లలతోటి అక్కడ వచ్చి ఉండడం వల్ల చూసేవారు బాధపడుతున్నారు, అక్కడ ఉండే ప్రజలు కూడా మీకు మా మద్దతు తెలుపుతామని తండోపతండాలుగా వచ్చి వారిపై పూలమాలలు వేసి పూల జల్లులు కురిపిస్తున్నారు ప్రజలు బాటసారిలు ఇంత చేస్తేనా కూడా కనీసం గౌరవం ముఖ్యమంత్రి కి తమ సాధక బాధకాలు ఎప్పుడు అర్థమవుతాయి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎక్కడికైనా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని తమ డిమాండ్లను పరిష్కరించాలని చేతులెట్టి దండం పెడుతున్నామని వారు చెప్తున్నారు ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి రజిత సుమ హేమలత తదితరులు పాల్గొన్నారు