జాతీయ చలన చిత్ర పురస్కారాల చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని కైవసం చేసుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా నిలిచిన అల్లుఅర్జున్ తాజాగా మరో అరుదైన ఘనతని సాధించారు. ఆయన మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ లో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదొక విశేషమైతే, ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్’లో మైనపు విగ్రహం ఉన్న మొదటి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రికార్డ్ క్రియేట్ చేయబోతుండటం మరో విశేషం. మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ ప్రతినిధులు అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియో ఒకటి వైరల్ రీసెంట్గా బాగా అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సంవత్సర ప్రారంభంలో దుబారులోని మేడమ్ టుస్సాడ్స్లో ప్రముఖులు, కళాకారుల మధ్య ఒక సిట్టింగ్ జరిగింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి 200కి పైగా కొలతలను వారు సేకరించారు. అద్భుతమైన మైనపు విగ్రహాలను రూపొందించడానికి డిటైల్డ్గా కొలతలు తీసుకునే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది. ఈ కొలతలతో వారు రూపొందించే విగ్రహాల పక్కన ఒరిజనల్ వ్యక్తులు నిలబడినా.. ఎవరు నార్మల్ పర్సనో కనిపెట్టడం కష్టమయ్యేంత అద్భుతంగా మైనపు విగ్రహాన్ని రూపొందిస్తారు. ‘అల్లు అర్జున్ నేడు ప్రపంచానికి తెలిసిన నటుడు. తన విలక్షణమైన నటనతో గ్లోబల్ రేంజ్ గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రాంతీయ సరిహద్దులను అధిగమించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారినే కాకుండా.. ఇతర భాషల వారిని సైతం తన అసాధారణమైన నటనా పటిమతో ఫ్యాన్స్ అయ్యేలా చేసుకున్నారు. అలాంటి అసాధారణ ప్రతిభగల నటుడి మైనపు విగ్రహాన్ని మా మ్యూజియంలో పెట్టడం ఆనందంగా ఉంది’ అని దుబారులోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తెలిపారు. అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న ‘పుష్ప ది రూల్’ వచ్చే ఏడాది ఆగస్ట్15న విడుదల కానుంది.