నవతెలంగాణ – అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 24 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు కలిపి మొత్తంగా దాదాపు 4లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఈ కింది లింక్లపై క్లిక్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.