– బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్
నవతెలంగాణ-పెద్దేముల్
ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధ వుడు తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అని పెద్దేముల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ కొనియాడారు. బుధవారం పెద్దేముల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్, తింసాన్ పల్లి గ్రామానికి చెందిన బంటు గోపాల్ కూతురు సంగీత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమెకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో ఎల్ఓసి ప్రత్యేక నిధుల ద్వారా ప్రత్యేక రూ.2 లక్షల 50 వేల చెక్కును కు టుంబ సభ్యుల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమెకు చెక్కును అందజేసినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకొని సాయం చేసిన ఎమ్మెల్యేకు, మండలాధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్ రంగయ్య, గ్రామ కమిటీ బీఆర్ఎస్ అధ్యక్షులు డివై. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మామిళ్ల వెంకటయ్య, బీఆర్ఎస్ యువజన సంఘం అధ్యక్షులు బంగ్లా రఘు, మాధవరెడ్డి, శీను గౌడ్, రమేష్ గౌడ్,తింసాన్ పల్లి శ్రీనివాస్, కొండూరు మాణిక్యం, చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.