నవ తెలంగాణ- ఆలేరు టౌను: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం ప్రతి ఒక్క సభ్యునికి ఆధార్ కార్డు లింకు చేస్తుండడంతో, ఆధార్ లింకులేని సభ్యుల తంటలు ఇoతా, అంతా కాదు. ప్రభుత్వం ఆధార్ కార్డు లింకు ఉంటేనే రేషన్ కార్డు దారునికి, ఇతర సంక్షేమ పథకాలకు అర్హులవుతారని ప్రభుత్వ అధికారులు చెబుతుండడంతో, ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఎపీజీవీబీ బ్యాంకు ముందు ఆధార్ లింకు కోసం గ్రామాల నుండి కాల కృత్యాలు తీర్చుకొని తిండి తిప్పలు మరిచి, ఉదయం 6, గంటల నుండే ఆలేరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు రౌతులు, బుక్స్,కవర్లు పెట్టి క్యూ లైన్ లో తమ ఉన్నట్లు తెలుపుతున్నారు.పిల్లాపాపలతో కలిసి ఉదయమే బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆధార్ కార్డు లింకు కోసం రేషన్ కార్డు దారులు ఇతర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తు చేసుకునే వారు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఉన్న రద్దీతో బ్యాంకు అధికారుల, సిబ్బందికి ఊపిరాడని పరిస్థితి నెలకొంటుంది. రెండు నెలల కాలం నుండి ఇదే పరిస్థితి నెలకొందని బ్యాంక్ అధికారులు తెలియజేస్తున్నారు.