– ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ -తాడ్వాయి
రేషన్ కార్డు ఈ- కేవైసీ కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోగ్యశ్రీ ఈ- కేవైసీ గడువును పొడిగించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దిగి చిరంజీవి డిమాండ్ చేశారు. సందర్భంగా దుగ్గి చిరంజీవి మాట్లాడుతూ ప్రజలు రేషన్ షాప్ ల వద్ద నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ కేవైసీ లేకపోతే రేషన్ బియ్యం రావని డీలర్లు అనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ గ్రామంలో చూసిన రేషన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారని అన్నారు. ఒక్కొక్కరి వివరాలు సరి చూసి ఈ కేవైసీ ప్రాసెస్ చేసేందుకు టైం పడుతుందని, పొలిటిషన్ షాప్ లోని బయోమెట్రిక్ మిషన్లలో వృద్ధులు చిన్న వేలిముద్రలు నమోదు కావడం లేదని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు రేషన్ కార్డు ఈ కేవైసీ గడువు తేదీని పొడిగించాలని కోరారు.