నవతెలంగాణ-గోవిందరావుపేట : మంత్రి పర్యటన సందర్భంగా ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పసర పోలీసులు గురువారం పలువురు అంగన్వాడీ టీచర్లను మరియు ఆశ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 12 మంది వరకు ఆశ మరియు అంగన్వాడి టీచర్స్ ను అదుపులోకి తీసుకొని మధ్యాహ్నం తర్వాత విడుదల చేసినట్లు పసర పోలీసులు తెలుపుతున్నారు. అంగన్వాడి ఆశాలను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకోవడమేనని ఇది మరి దుర్మార్గం చర్య అని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాస్వామిక వాదులు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి మంత్రికి తమ సమస్యను చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమనీ అన్నారు. పోలీసులు ప్రభుత్వం అనిత కార్యక్రమాల ద్వారా ఉద్యమాలు సమసిపోవాలని మరింత పెరుగుతాయని పలువురు మేధావులు వ్యాఖ్యానించారు.