ఆశ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని శనివారం మండల కేంద్రంలో ఆశా వర్కర్లు, తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు నాలి జయసుధ ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి, వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశాలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారితోష్కాలను రూ. 18 వేలకు పెంచి ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని అన్నారు. పారితోషికం లేని అదన పనులు ఆశాలతో చేయించకూడదని, టీబీ స్ర్పూటమ్ డబ్బాలను ఆశలతో మోపంచే పని రద్దు చేయాలన్నారు. టిబి, లెప్రసీ, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలన్నారు. అంతేకాకుండా ఆశాలకు ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశాలు కవిత, రమాదేవి, అనిత రత్న కుమారి, మంజుల, ఆదిలక్ష్మి, పద్మ 30 మంది ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.