నవతెలంగాణ -డిచ్ పల్లి
రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీ లకు చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేయాలని సాధన దీక్ష వద్దకు తెలంగాణ యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ కమిటీ అధ్వర్యంలో శిబిరానికి వెళ్ళి సంఘీభావం తెలిపారు.గత 20 రోజులుగా నిరవాదికంగా ఈ సాధన దీక్షను కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 16 ప్రకారం యుజిసి,ఎఐసిటిఎ రూల్స్ పెట్టిందో, అందులోకి కాంట్రాక్ట్ అధ్యాపకులు కూడా వస్తారని వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 12 రకాల యూనివర్సిటీలో ఉన్న 1445 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేసే విధంగా చూడాలని సూచించారు.కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ యూనివర్సిటీ నాయకులు విజయ్, అనిల్,రాజేందర్, శివకుమార్,మహేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అధ్యాపకులు దత్తహరి, శ్రీనివాస్, కిరణ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.