నవతెలంగాణ – ఉత్తర్ ప్రదేశ్: గురువారం రోజు ఫతేపూర్లోని ఒక గ్రామంలో జరిగిన వివాహానికి బాలిక, ఆమె కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో పెళ్లి మండపం నుంచి బాలిక కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి తెలిపారు. ఈ క్రమంలో అమె బంధువులు, కుటుంబసభ్యులు గంటల తరబడి వెతికినా.. బాలిక కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు పెళ్లి వేదిక సమీపంలో బాలిక తీవ్ర రక్తస్రావంతో కనిపించింది. ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా బాలిక మరణించింది. నిందితుడిని ఇంటిని బుల్డోజర్ తో కూల్చేయాలని యువతి తరుపు బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువుగా నటిస్తూ నిందితుడు బాలికను ట్రాప్ చేశాడని, ఆ తరువాత అత్యాచారం చేశాడని ఆరోపించారు.