– 1,35,160 రూపాయలు పట్టివేత
– ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ 5 సెల్ ఫోన్లు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సూచనలతో టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య, టాస్క్ ఫోర్స్ టీమ్ శనివారం అర్ధరాత్రి ఒకటి గంటల తర్వాత పక్కా సమాచారం మేరకు శాలిమర్ ఫంక్షన్ హల్ ముందు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడులలో 135160 రూపాయలు 6 సభ్యులు గల పేకాట ఆడుతున్న ముఠా, సెల్ ఫోన్స్ 5, ఆర్గనైజర్ ఇబ్రహీం ఖాన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఐదవ పోలీస్ స్టేషన్ నగదు ఆరుగురు పేకాట ఆడుతున్న సభ్యులు ఐదు సెల్ ఫోన్లు ఆర్గనైజర్ ఇబ్రహీం ఖాన్ లను 5వ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య ఆదివారం తెలిపారు. ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఐదవ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.