![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230909-WA0025-300x184.jpg)
భిక్నూర్ మండలంలోని గుర్జకుంట గ్రామంలో శనివారం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాడి పశువుల పోషణ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి రాజేశ్వర్ మాట్లాడుతూ నాణ్యమైన పాల దిగుబడి, పాలలో ఉన్న వెన్న శాతం పెరిగే విధానం, హెడ్జ్ లోసర్ గడ్డిలో లభించే పోషక విలువలు అధికంగా ఉంటాయని, లోసర్ గడ్డిని పశువులకు మేతగా ఎంచుకోవాలని పాడి రైతులకు సూచించారు. నాణ్యమైన పశుగ్రాసం నేపియర్, సూపర్ నేపియర్, హెడ్జ్ లూసర్, ఆజోల్ల లాంటి గడ్డి విత్తనాలను ఎంచుకోని పశువులకు పెట్టే మేతలో ఎండు గడ్డి, పచ్చి గడ్డి, తౌడు, దానలో మినరల్ మిక్సర్ పెట్టాలని, ఎల్లప్పుడు పశువుల పాకలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం సర్పంచ్ మనోహర రమేష్ రెడ్డి మాట్లాడుతూ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయంలో వివిధ సబ్సిడీలు కల్పిస్తూ ఆర్థికంగా రైతులను అభివృద్ధి చేస్తున్నందుకు గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల డైరీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, రమేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, రామిరెడ్డి, ప్రభాకర్, రాజిరెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ పోగ్రామ్ ఫెసిలిటేటర్ భూపతి, తదితరులు పాల్గొన్నారు.