![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230925-WA0006-300x225.jpg)
మండలంలోని బషీరాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం పరిశుభ్రత పై మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సక్కరం అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మహిళలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా నిల్వ ఉంచాలని సూచించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చెత్తను సేకరించేందుకు వచ్చినప్పుడు అందులో కూడా తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగానే వేయాలన్నారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.ఇంటి పరిసరాల్లో పాడైన వస్తువుల్లో రోజుల తరబడి నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ కస్తూరి విక్రమ్, వార్డు సభ్యులు నీలిమ, గిరిజ, శారద, శ్యామ్, గణేష్, లావణ్య, ఇందుమతి, ఎర్రవ్వ, పోషన్న, సాగర్, విజయ, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.