నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ హుమాయున్ పోలీస్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెవిటి, మూగ మహిళపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళను బాత్రూమ్లో బంధించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయ్ నగర్ కాలనీలో చెవిటి, మూగ అయిన మహిళపై ఇంటికి ఎదురుగా ఉండే సాయి అనే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళను బాత్రూమ్లో బంధించి లైంగికదాడి చేశాడు. మహిళ భర్త కూడా దివ్యాంగుడు. తన తల్లిని తీసుకుని బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడిన సాయి అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు మూగది కావడంతో అరవలేకపోయింది. అనంతరం ఆమెను లోపలే ఉంచి గడియ పెట్టి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి గమనించన భర్తకు ఆమె విషయం చెప్పడంతో హుమాయును నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.