నవతెలంగాణ – హైదరాబాద్: అవినీతిని సృష్టించి చంద్రబాబును కస్టడీలోనికి తీసుకున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. మంగళవారం మంగళగిరిలో నిర్వహించిన టిడిపి నేతల సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు సంక్షేమానికి- అభివృద్ధికి ఒక బ్రాండ్ అని చెప్పారు. యావత్ ప్రపంచ దేశాలన్నీ చంద్రబాబు గురించి చెప్పుకుంటాయన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదన్న భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ” నేను 16 నెలలు జైల్లో ఉన్నాను.. కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైలులో పెట్టాలి ” అన్న దురుద్దేశంతోనే ఈ స్కాంను క్రియేట్ చేశారని ఆరోపించారు. మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలని అన్నారు. ” లక్షలకోట్ల అవినీతి అర్భక.. పక్షపాతక రూపక.. లక్షల కోట్ల భక్షక.. జగమెరిగిన జగన్నాటక.. ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక.. రాష్ట్రానికి రావణపాలక.. చోరక ” అని అభివర్ణించారు. వైసిపి పాలనపై ధ్వజమెత్తారు.