![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/24rudrangi.03.jpg)
గ్రామపంచాయతీ కార్మికులు గత 19 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తు రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం ఇంటింటికి తిరుగుతూ బిక్షాటన చేశారు.తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.బిక్షాటన చేస్తున్న కార్మికులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి మద్దతు తెలిపి మాట్లాడుతూ.నిరంతరం ప్రజా సేవ చేస్తూ గ్రామాలను శుభ్రం చేస్తున్న గ్రామ పంచాయితీ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరమని అన్నారు.వెంటనే గ్రామ పంచాయితీ కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.