నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని బిర్మల్ తండా గ్రామపంచాయతీ నిర్మాణానికి ఎంపీపీ రాధా బలరాం జెడ్పిటిసి సభ్యుడు శంకర్ నాయకులతో కలిసి స్థానిక సర్పంచ్ గోతి ధర్భర్ గ్రామపంచాయతీ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆయన అన్నారు ఈకార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం, జెడ్పిటిసి సభ్యులు శంకర్ నాయక్, వైస్ ఎంపీపీ భజన్ లాల్, బిర్మల్ తండాసర్పంచ్ గోతిదర్బార్, ఉపసర్పంచ్ సీతారాంనాయక్, టిఆర్ఎస్ నాయకులు తండాపెద్ద నాయకులు తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.