నవతెలంగాణ- హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ఉప్పల్ నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నియోజకవర్గ బి-బ్లాక్ అధ్యక్షుడు, ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషారెడ్డి భర్త సోమశేఖర్రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి సోమశేఖర్రెడ్డి టిక్కెట్ ఆశించారు. అధిష్టానం స్ర్కీనింగ్ కమిటీకి తన పేరును ప్రతిపాదించక పోవడంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన భార్య శిరీషారెడ్డి ప్రస్తుతం ఏఎ్సరావు నగర్ డివిజన్ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డానని తెలిపారు. ఉప్పల్ ఎన్నికల బరిలో ఉంటానని, స్వతంత్రంగానా, లేక ఏ పార్టీ నుంచి అనేది త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. అనుచరులు నిరాశకు లోనుకావద్దని సూచించారు.