నవ తెలంగాణ – నవీపేట్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని బినోల గ్రామానికి చెందిన సన్నీ గౌడ్(23) నెల్లూరు సముద్రతీరంలో స్నానానికి వెళ్లి బుధవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత రెండు రోజుల క్రితం బాలరాజ్ గౌడ్, విజయ దంపతుల కుమారుడైన సన్నీ గౌడ్ కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణంలో నెల్లూరు సముద్ర తీరంలోని మైపాడ్ బీచ్ కి వెళ్లి స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకొనిపోయాడు. గమనించి కాపాడేందుకు ప్రయత్నించిన చిల్లకూరు యువకుడు కాపాడేందుకు ప్రయత్నించగా అతడు సైతం మృతి చెందాడు. బాల్ రాజ్ గౌడ్, విజయ దంపతులకు ఏకైక కుమారుడైన సన్నీ గౌడ్ మృతి చెందడంతో బినోల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని గురువారం ఉదయం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.