– ఎన్సిపి అధినేత శరద్ పవార్
ముంబయి : ప్రజల మధ్య బిజెపి చిచ్చుపెడుతోందని, మతం, వర్గాల ప్రాతిపదికన విభజిస్తోందని ఎన్సిపి అధినేత శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఆయన బుధవారం ఛత్రపతి శంభాజీనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
బిజెపిని ఎదుర్కొనేందుకు వ్యూహాన్ని రచించామన్నారు. విభజన దినోత్సవాన్ని జరుపుకోవాలనే నిర్ణయం సరికాదని పవార్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్తో పాటు మహారాష్ట్రలోని ప్రభుత్వాలను అస్థిరపరిచిందని విమ ర్శించారు. మణిపూర్ సున్నితమైన రాష్ట్రమని, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అక్కడ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు దారుణమని, మణిపూర్పై ప్రధాని ఎక్కువ మాట్లాడి ఉండాల్సిందని అన్నారు.