రెంజల్ మండలం నీల సొసైటీ చైర్మన్ ను టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిపారు. ఇటీవల రెంజల్ మండలంలో పొద్దుతిరుగుడు పంట పండించిన రైతులకు విక్రయించుకోవడానికి నానా అవస్థలు కలగడంతో, పెగడపల్లి సొసైటీ ద్వారా వాటిని విక్రయించడానికి ప్రత్యేక చొరవ తీసుకొని రైతులకు అండగా నిలిచారని వారన్నారు. మండలంలో పొద్దు తిరుగుడు పంటను సాగు చేస్తున్న రైతులకు నీల సొసైటీలోనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి విక్రయించడమే కాకుండా సొసైటీకి లాభాలను తీసుకువచ్చారని, రైతు రాఘవేందర్ స్పష్టం చేశారు .ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాఘవాచారి, సుభాష్, భాస్కర్, అక్తర్ నవీపేట్ బలరాం, ఆకాష్, స్థానిక రైతులు పాల్గొన్నారు.